బుస్సాపూర్ శంకర్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో చేరిన యువకులు

Young people who joined the YSR Telangana party under Bussapur Shankar

నిజామాబాద్‌ (‌చట్టం) : నిజామాబాద్ నగరంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిజామాబాద్ అర్బన్ కో ఆర్డినేటర్ బుస్సాపూర్ శంకర్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో పెద్ద ఎత్తున యువకులు చేరడం జరిగింది.

ఈ సందర్భంగా బుస్సాపూర్ శంకర్ మాట్లాడుతూ తెలంగాణలో వైఎస్ఆర్ సంక్షేమ పాలన రావాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాజన్న సంక్షేమ పాలన రావడానికి ప్రతి ఒక్కరి సహకారం కావాలన్నారు.

షర్మిలమ్మ ముఖ్యమంత్రి అయితే రాజన్న పాలన మళ్ళీ వస్తుందన్నారు. ఎందరో పేదల జీవితలను మార్చిన ఆరోగ్య శ్రీ పథకం, ఫీజ్ రీ యంబర్స్‌మెంట్‌ ‌పథకం మళ్ళీ అమలవుతుందన్నారు. విద్యార్థులకు చదువు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, పేదలకు ఆరోగ్య శ్రీ, మహిళలకు వడ్డీ లేని రుణాలు, రైతులకు రుణమాఫీ, మద్దత్తు ధర వస్తాయన్నారు.

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కో ఆర్డినేటర్ నీలం రమేష్ సూచన మేరకు నిజామాబాద్ జిల్లాలో కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పోతరాజు మదన్, భిక్షపతి, ప్రితం, రాహుల్, సత్పాల్, రవి, సాజిద్, మతీన్, రెహన్, సతీష్,నర్సింగ్, రాజా బాబు, షేక్ కరీం పటేల్, రాజన్న రాము, రామ్ చందర్, విశాల్, శ్యామ్, డి.రాజు, బాల్ కిషన్, శ్రీమాన్ సాయి, తదితరులు పాల్గొన్నారు.

Comments are closed.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More